మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భైరవం’(Bhairavam). విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై కథానాయికలుగా నటించారు. కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఏలూరులో ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్లో మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల మంచు కుటుంబంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించారు. సొంత వాళ్లే తనను దూరం పెట్టిన ఈరోజుల్లో అభిమానులు తనను ఆదరించారని పేర్కొన్నారు. కట్టుబట్టలతో రోడ్డు మీదకు తీసుకొచ్చారని ఎమోషన్ అయ్యారు. అయినా కానీ తన కట్టె కాలేవరకూ తాను మోహన్ బాబు కుమారుడేనని తెలిపారు.
తాజాగా మంచు మనోజ్కు అండగా ఉంటానని నారా రోహిత్ పోస్ట్ పెట్టారు. ‘‘భైరవం’ ఈవెంట్తో ఏలూరులో నిన్న అద్భుతమైన సాయంత్రాన్ని ఆస్వాదించాం. మా ఈవెంట్ను ఎంతో ప్రత్యేకంగా మార్చిన ఏలూరు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మంచు మనోజ్ బాబాయ్ ఈ ఈవెంట్కే హైలైట్గా నిలిచాడు. ఆయన స్పీచ్ ఎంతో పవర్ఫుల్, భావోద్వేగంగా, హృదయాన్ని హత్తుకునేలా ఉంది. విషయం ఏదైనా.. నేను నీకు తోడుగా ఉంటాను బాబాయ్. లవ్ యూ’’ అని రాసుకొచ్చారు.