Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభMahesh-Namratha Hotel : ప్లేట్ పునుగులు 125, ప్లెయిన్ దోస 150.. మరీ ఇంతా.. నమ్రతని...

Mahesh-Namratha Hotel : ప్లేట్ పునుగులు 125, ప్లెయిన్ దోస 150.. మరీ ఇంతా.. నమ్రతని ఆడేసుకుంటున్న నెటిజన్లు..

- Advertisement -

Mahesh-Namratha Hotel : సినిమా వాళ్లంతా అక్కడ డబ్బులు సంపాదించి బయట వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఇప్పటికే సినిమా థియేట్ర్స్ నడుపుతున్నాడు. తాజాగా తన భార్య పేరు మీద ఆసియన్ గ్రూప్ తో కలిసి AN రెస్టారెంట్స్ అని ఓపెన్ చేశాడు.

హైదరాబాద్ బంజారాహిల్స్ లో AN హోటల్స్ మొదటి బ్రాంచ్ ని నమ్రత ఇటీవలే గ్రాండ్ గా ఓపెన్ చేశారు. అయితే ఈ హోటల్ మెనూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మెనూ లో ఉన్న రేట్లు చూసి మామూలు ప్రజలు షాక్ అవుతున్నారు. కొన్ని రేట్లు అయితే మరీ దారుణంగా ఉండటంతో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇడ్లి 90 రూపాయలు, ప్లేట్ పునుగులు 125 రూపాయలు, ప్లెయిన్ దోస 150 రూపాయలు.. ఇలా రేట్లన్నీ భారీగా ఉండటంతో ఈ రేట్లతో బయట కడుపునిండా నాలుగు ప్లాట్లు తినొచ్చు, ఈ రేట్లతో ఫుల్ బిర్యానీ వస్తుంది, ఇది ఓన్లీ డబ్బున్నోళ్లకే ఈ హోటల్ అంటూ నెటిజన్లు, మీమర్లు నమ్రతని ఆడేసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పెద్ద పెద్ద హోటల్స్ లో రేట్లు అలాగే ఉంటాయి, అక్కడికి డబ్బున్నోళ్లే వెళ్తారు అంటూ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్-నమ్రత రెస్టారెంట్ కి ఈ విధంగా ఫ్రీ పబ్లిసిటీ బాగానే వచ్చింది..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News