Prabhas: అనుకున్నదే జరిగింది. ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిసెంబర్ నుంచి జనవరికి పోస్ట్పోన్ అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అఫీషియల్గా ప్రకటించారు. తేజా సజ్జా మిరాయ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజాసాబ్ రిలీజ్ డేట్పై నిర్మాత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 5న కాకుండా జనవరి 9న రాజాసాబ్ మూవీని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. రాజాసాబ్ పోస్ట్పోన్ కావడం ఇది రెండోసారి. తొలుత ఈ ఏడాది ఏప్రిల్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కావడంతో డిసెంబర్ 5కి సినిమాను వాయిదావేశారు. తాజాగా మరోసారి డిసెంబర్ నుంచి జనవరికి ఈ సినిమా పోస్ట్పోన్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతోన్నారు.
సంక్రాంతికి రిలీజ్ చేస్తే కలెక్షన్స్ పరంగా మంచి అడ్వాంటేజ్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ మేరకు సినిమాను జనవరికి రిలీజ్ డేట్ను మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజాసాబ్ షూటింగ్ కూడా చాలానే బ్యాలెన్స్ ఉందట. ఓ మూడు పాటలతో పాటు కొంత టాకీపార్ట్ పెండింగ్లో ఉందని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ఓ భారీ సెట్లో ప్రభాస్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నారు. సెప్టెంబర్లో కేరళలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ను షూట్ చేయబోతున్నారు. అక్టోబర్లో మిగిలిన పాటల షూటింగ్ కోసం చిత్ర యూనిట్ గ్రీస్కు వెళ్లనుందట.
Also Read – Visakhapatnam : విద్యార్థిని గాయపరిచిన ఉపాధ్యాయుడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
హారర్ కామెడీ మూవీ…
రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ హారర్ కామెడీ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్దత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో ప్రభాస్కు జోడీగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్తో పాటు రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
రాజాసాబ్తో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ షూటింగ్ దశలో ఉంది. హిస్టారికల్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. స్పిరిట్తో పాటు కల్కి2, సలార్ 2 సినిమాలు అంగీకరించాడు ప్రభాస్.
Also Read – Jaganmohan Rao : HCA మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు బెయిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు


