Nabha Natesh – Nidhhi Aagerwal: సౌత్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా పూరి జగన్నాధ్ కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలతో ప్రతీ హీరోకి విపరీతమైన మాస్ ఇమేజ్ వచ్చింది. క్లాస్గా కనిపించే సూపర్ స్టార్ మహేశ్ని కూడా పోకిరి, బిజినెస్ మేన్గా చూపించి ఇండస్ట్రీ రికార్డ్స్ని క్రియేట్ చేశారు. పూరి కథ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. చాలామంది హీరోలు పూరి తో సినిమాలు చేశాకే ఓ స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
పూరి జగన్నాధ్ తన సినిమాలలో హీరోయిన్ని చూపించే విధానం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ఆయన చూపించినంత గ్లామర్గా మరో దర్శకుడు చూపించలేరు. అంతేకాదు, కథ రాసుకున్నపుడే హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్కి అంతే ఇంపార్టెన్స్ ఉండేలా రాసుకుంటారు. ఆయన సినిమాల ద్వార పరిచయమైన అనుష్క శెట్టి, ఆసిన్, రక్షిత, దిశ పఠాని లాంటి వారు ఇప్పటికీ అగ్ర తారలుగా వెలుగుతున్నారు. అప్పటి వరకు సినిమాలు చేసినా సక్సెస్లు లేని నిధి అగర్వాల్, నభా నటేశ్ కి ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) సినిమాతో మంచి క్రేజ్ని తెచ్చిపెట్టారు.
ఇప్పుడు ఇదే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. పూరికి బాగా కలిసి వచ్చిన ఈ ఇస్మార్ట్ బ్యూటీస్ని ఎలా మిస్ అయ్యారు అని. త్వరలో ఆయన దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. హీరోగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), హీరోయిన్గా సంయుక్త మేనన్ (Samyuktha menon), కీలక పాత్రల్లో.. టబు(Tabu), దునియా విజయ్
(Duniya Vijay) ఎంపికయ్యారు. ఈ కాస్టింగ్ చూసే పూరి ఈసారి మాత్రం హిట్ మిస్ అవరని చెప్పుకుంటున్నారు.
అయితే, ప్రస్తుతం క్రేజ్లో లేని నభాకి ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చి ఉంటే బావుండేదని చెప్పుకుంటున్నారు. అలాగే, నిధి విషయంలోనూ. ఇస్మార్ట్ శంకర్ కి ముందు ఆ తర్వాత ఈ హీరోయిన్స్ ఇద్దరు సక్సెస్లలో లేరని గమనిస్తే తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్కి కారణం నభా, నిధి కూడా. వీరిద్దరు పూరికి బాగానే కనెక్ట్ అయ్యారు, కలిసొచ్చారు. ఆ తర్వాత చేసిన సినిమాలలో హీరోయిన్స్ పూరికి అచ్చిరాలేదు. కాబట్టే ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న బెగ్గర్ సినిమా కోసం నభా, నిధిలలో ఒకరినైనా తీసుకోవాల్సింది అంటున్నారు. మరి, ఐటం సాంగ్ కోసమైనా వీరికి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.