Friday, June 6, 2025
Homeచిత్ర ప్రభNarayana Murthy:'ప్రాణాలకి తెగించే వచ్చాం'.. ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం

Narayana Murthy:’ప్రాణాలకి తెగించే వచ్చాం’.. ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం

ఆపరేషన్ కగార్‌ పేరుతో మావోయిస్టులను చంపడం దారుణమని పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి(Narayana Murthy)ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ పై హైదరాబాద్ లో నిర్వహించిన రౌంట్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. శత్రుదేశమైన పాకిస్థాన్‌తో చర్చలు జరిపి ఆపరేషన్ సిందూర్‌ని ఆపారని.. మరి అలాంటప్పుడు భరతమాత బిడ్డలైన నక్సలైట్‌‌లతో ఎందుకు చర్చలు జరపకుండా దారుణంగా చంపుతున్నారని వాపోయారు.

“ప్రాణాలను తెగించే వచ్చాం.. అమ్మని, బాబుని, ఇల్లు, వాకిలి, సమస్తం వదలుకుని వచ్చాం. ప్రాణం అంటే మాకు భయం లేదు. మాకోసం మేం శాంతి చర్చలు జరపమని చెప్పడం లేదు. అమాయకులై ఆదివాసీలు చనిపోతున్నారు. ప్లీజ్ సార్.. వాళ్లు చావకూడదు. శాంతి చర్చలు జరపండీ అంటే.. మీరు శాంతి చర్చలు జరపరా? ఎంత దారుణం అండీ ఇది.

ఇదేం న్యాయం అండీ.. శత్రుదేశమైన పాకిస్థాన్‌తో చర్చలు జరిపిపారు. కానీ దేశంలో పుట్టిన ఈ భరతమాత బిడ్డలైన వీళ్లు శాంతి చర్చలు జరపడం లేదంటే ఎంత అమానవీయం. కనీసం ఇప్పటికైనా ఆపరేషణ్ కగార్‌ని ఆపి. శాంతి చర్చలు జరపండి మోడీగారూ. కగార్ అంటే అంతు.. అంతం. దిస్ ఈజ్ ఫైనల్ వార్ బిట్వీన్ నక్సలైట్ అని గవర్నమెంట్ వాళ్లు ఛాలెంజ్‌లు చేస్తున్నారంటే ఏమనుకోవాలి.

నక్సలైట్ అంటే ఎవరు? ఆకలి ఉన్నంత కాలం.. దోపిడి ఉన్నంత కాలం అడిగినోడు నక్సలైట్.. అడగనోడు ఆల్ రైట్. నక్సలైట్ అంటే వాళ్లు కూడా మన భరతమాత బిడ్డలే సార్. మాట్లాడితే హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాం అంటున్నారు. హిందూ దేశం అంటున్నారు. అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారమే కర్మకాండ జరిపించాలి ఎవరైనా చనిపోతే. అలాంటి కర్మకాండ జరిపించుకోవడానికి వాళ్ల శవాలను కూడా ఇవ్వడం లేదంటే ఏంటి సార్ ఇదీ.

ఇక మీరేం హిందువులు.. మీరేం హిందూ పార్టీ. హిందూ సాంప్రదాయం ప్రకారం జరగాల్సిన కర్మకాండల్ని సైతం అడ్డుకుంటున్నారంటే.. ఇక మీరేం హిందువులు. మీకు హిందూయిజంపై ఏం రెస్పెక్ట్ ఉంది. శాంతి చర్చలు జరిపి వాళ్లని బతకనివ్వండి సార్.. కాల్పులు ఆపండి సార్.. ప్లీజ్.. మోడీజీ.. అమిత్ షా జీ.. దయచేసి ఆపండి సార్. ఆకలి బాధలు.. దోపిడీ ఉన్నంత కాలం తిరుగుబాటు తప్పదు. కాబట్టి ఆపరేషన్ కగార్ పేరు చెప్పి ఎవర్నీ చంపొద్దు సార్.

ఎందుకు నక్సలైట్‌లను ఇంత దారుణంగా చంపేస్తున్నారు. పాకిస్తాన్‌తో జర్చలు జరిపిన వాడు.. మాతృబిడ్డలతో చర్చలు జరపలేకపోతున్నారా? ఆదివాసీలపై దయచూపండి మోడీజీ.ఆదివాసీ రక్షణ కోసం.. అందరూ బతకండి కోసం.. ఆపరేషన్ కగార్‌ని ఆపండి’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News