Thursday, June 5, 2025
Homeచిత్ర ప్రభస్టేజ్‌పైనే కన్నీటి పర్యంతమైన రీతు వర్మ.. ఏమయ్యిందంటే..?

స్టేజ్‌పైనే కన్నీటి పర్యంతమైన రీతు వర్మ.. ఏమయ్యిందంటే..?

పెళ్లిచూపులు మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకున్న హీరోయిన్ రీతు వర్మ. వరుస హిట్ మూవీలతో దూసుకు పోతోంది. మజాకా సినిమాతో ఇటీవల వెండితెరపై కనిపించిన ఆమె, ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ‘దేవిక అండ్ డానీ’ అనే వెబ్ సిరీస్‌లో రీతు ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సిరీస్ జూన్ 6న జియో సినెమాలో స్ట్రీమింగ్‌కి రానుండగా, ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ వేడుకలో రీతు వర్మ భావోద్వేగానికి గురై, స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది.

- Advertisement -

ఈ సందర్భంగా రీతూ వర్మ మాట్లాడుతూ.. మన చుట్టూ ఉండే కొంతమంది ఎప్పుడూ సవాళ్లు విసురుతూనే ఉంటారు. నువ్వు ఇది చేయలేవు, అలా చేయొద్దని చెబుతారు. కొందరు ఓపెన్‌గా చులకనగా చూస్తారు. ఈ సిరీస్ అలాంటి ప్రతి ఒక్కరికీ సమాధానం చెబుతుంది.. ఆడపిల్లలకే ఎక్కువగా ఎదురయ్యే చలనాత్మక సంఘటనలను ఇది చూపిస్తుంది అని తెలిపింది. జీవితంలో ముందుకు వెళ్లేందుకు నమ్మకాన్ని ఇస్తుంది అంటూ ఆమె తెలిపింది.

ఈ మాటలపై అక్కడున్నవారు మౌనంగా ఆలకించగా.. రీతు భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆమెపై మళ్లీ స్పాట్‌లైట్ పడి౦చింది. ఈ వెబ్‌సిరీస్‌ను ‘శ్రీకారం’ ఫేమ్ కిశోర్ డైరెక్ట్ చేస్తుండగా, హీరోగా సూర్య విశిష్ట నటిస్తున్నారు. శివ కందుకూరి, సుబ్బరాజు, మోనికా రెడ్డి, సోనియా సింగ్, చాగంటి సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైవిధ్యమైన కంటెంట్‌తో ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News