విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానియికలుగా, వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న థియేటర్స్లో రిలీజై బ్లాక్బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసి వసూళ్ల సునామి సృష్టించింది. ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో కూడా ఈచిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అంతేకాకుండా టీవీ వ్యూస్లోనూ చరిత్ర సృష్టించింది. మార్చి1 సాయంత్రం 6 గంటలకు జీ5 ఓటీటీతో పాటు జీ తెలుగు ఛానల్లోనూ ప్రసారం చేశారు.
టీవీలో ఏకంగా 18.1 టీఆర్పీని సాధించింది. గత రెండేళ్లలో కాలంలో ఓ చిత్రానికి ఈ స్థాయిలో టీఆర్పీ రావడం ఇదే తొలిసారి. అటు జీ5 ఓటీటీలోనూ రికార్డ్స్ బ్రేక్ చేసింది. తొలి రోజే జీ5 ఓటీటీలో 310 ఫ్లస్ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
