Samyuktha Menon- Anupama Parameswaran: మన హీరోలలో కొందరికి సిగ్గెక్కువ. హీరోయిన్స్తో రొమాంటిక్స్ సీన్స్ చేయాలన్నా, లిప్ లాక్స్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. పదుల సంఖ్యలో చిత్ర యూనిట్ ఉంటే వారి ముందు హీరోయిన్ ని కౌగిలించుకోవడం, రొమాన్స్ చేయడం అంటే చమటలు పట్టేస్తాయి. ఈ విషయంలో ప్రభాస్, గోపీచంద్ లకి చాలా సిగ్గు.
అలాంటి ఇబ్బంది మన యంగ్ హీరో శర్వానంద్ కి ఉందని చెప్పుకుంటుంటారు. అలాంటి ఆయన తన లేటెస్ట్ మూవీ కోసం ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయాలట. గత కొంతకాలంగా శర్వా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే, వరుసగా మూడు సినిమాలు లైనప్ చేసుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తోన్న 35, 36, 37 చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. శర్వా 35వ చిత్రం నారీ నారీ నడుమ మురారీ వస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/raja-saab-team-complaint-in-banjara-hills-police-station/
ఈ సినిమాలో శర్వాకి జంటగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే, సాక్షి వైద్య, సంయుక్త మీనన్ కన్ఫర్మ్ అయ్యారు. వీరితో పాటు మరో హాట్ బ్యూటీ కూడా నటిస్తున్నట్లు సమాచారం. అలాగే శర్వానంద్ 37వ చిత్రంగా భోగి రూపొందుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోనూ మూడవ హీరోయిన్ కు ఛాన్స్ ఉందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
1960ల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన యదార్థ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నట్టుగా సమాచారం. ఈ రెండు చిత్రాలకి సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే శర్వా తన 36వ సినిమాను కూడా ప్రకటించారు. కాకపోతే ఈ సినిమా ఇంకా సెట్స్పైకి రాలేదు. అయితే, ఈ సినిమాలోనూ కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు శర్వా ముగ్గురు హీరోయిన్స్తో కలిసి నటించలేదు. అలాంటిది ఇప్పుడు మూడు సినిమాలలోనూ ముగ్గురేసి హీరోయిన్స్తో రొమాన్స్ చేయడం అంటే అది ఈ యంగ్ హీరో వల్ల అవుతుందా అనేది చూడాలి.