అక్కినేని యువ హీరో నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా నటించిన ‘తండేల్’(Thandel) మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో చైతన్య కెరీర్లోనే తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. చైతూ, సాయి పల్లవి జోడీకి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.21.24కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదరగొట్టింది.
రెండో రోజు రూ.20కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో రెండు రోజులకు మొత్తం రూ.41.20 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. అటు ఓవర్సీస్లోనూ ‘తండేల్’ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైతన్య కెరీర్లో బ్లాక్బాస్టర్ మూవీగా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్తో నిర్మించగా.. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/GjUqBZ_bMAEAmCn-819x1024.jpg)