Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి(AS Ravi Kumar Chowdary) హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం సంతాపం ప్రకటించింది. అలాగే పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
కాగా గోపిచంద్ హీరోగా ‘యజ్జం’ మూవీతో రవికుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో బాలకృష్ణతో ‘వీరభద్ర’, నితిన్తో ‘ఆటాడిస్తా’, సాయి ధరమ్ తేజ్తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, గోపిచంద్తో ‘సౌఖ్యం’ వంటి సినిమాలు తెరకెక్కించారు. చివరిగా యువ హీరో రాజ్ తరుణ్తో ‘తిరగబడరా సామి’ సినిమాని తీశారు.
ఆయన చేసిన చివరి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోవడంతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యారని చెబుతున్నారు. దీంతో చెడు వ్యసనాలకు బానిసై కుటుంబానికి దూరంగా ఉంటున్నారని సమాచారం.
Tollywood: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES