Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభVakkantham Vamsi : ఆ సినిమా నా వల్లే హిట్ అయిందంటూ.. పూరి జగన్నాధ్ పై...

Vakkantham Vamsi : ఆ సినిమా నా వల్లే హిట్ అయిందంటూ.. పూరి జగన్నాధ్ పై స్టార్ రైటర్ సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

Vakkantham Vamsi : తెలుగులో కిక్, టెంపర్, రేసుగుర్రం, ఊసరవెల్లి లాంటి సూపర్ హిట్ సినిమాలకి కథ అందించిన రచయిత వక్కంతం వంశీ ఆ తర్వాత డైరెక్టర్ గా మారి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కూడా తీశాడు. కానీ ఆ సినిమా ఆశించినంత ఫలితం అందుకోలేదు. ప్రస్తుతం మళ్ళీ దర్శకుడిగానే మరో సినిమాని తీయడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా వక్కంతం వంశీ అలీతో సరదాగా షోకి వచ్చారు. ఈ షోలో సినిమాల గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు.

ఎన్టీఆర్ కి వరుస ఫ్లాప్స్ తర్వాత భారీ కంబ్యాక్ ఇచ్చిన సినిమా టెంపర్. ఈ సినిమాకి వక్కంతం వంశీ రచయితగా పని చేయగా పూరి జగన్నాధ్ తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా గురించి వంశీ మాట్లాడుతూ.. ”సినిమా కథా చర్చలు జరుగుతున్న సమయంలో క్లైమాక్స్ కోసం చాలా ఆలోచించాము. అప్పుడు పూరి జగన్నాధ్.. కోర్టులో CD ఖాళీగా ఉంది అని చెప్పగానే వెంటనే ఆ నలుగురిని కోర్ట్ బయటకి తీసుకొచ్చి హీరో కొట్టి చంపేస్తాడు, అక్కడికి సినిమా అయిపోద్ది అని చెప్పాడు. అది నేను రచయితగా ఒప్పుకోలేదు, ఎన్టీఆర్ కూడా వద్దన్నారు. ఆ క్లైమాక్స్ చాలా సింపుల్ గా అనిపించింది. ఆ తర్వాత హీరో నేరం తనపై వేసుకుంటాడు అని నేను రాసిన క్లైమాక్స్ చెప్పాను, దానికి ఎన్టీఆర్ కూడా ఒప్పుకోవడంతో అదే తీశారు. ఆ సినిమాకి క్లైమాక్స్ ఎంత ప్లస్ అయిందో అందరికి తెలిసిందే. క్లైమాక్స్ వల్లే సినిమా హిట్ అయిందని కూడా చాలా మంది చెప్పారు” అని అన్నారు.

ఇండైరెక్ట్ గా పూరి చెప్పిన క్లైమాక్స్ తీసి ఉంటే సినిమా పోయేదని, తాను ఇచ్చిన క్లైమాక్ వల్ల సినిమా పెద్ద హిట్ అయిందని అన్నాడు. దీంతో ఈ ఇంటర్వ్యూ చూసి ఎన్టీఆర్ అభిమానులు పూరి జగన్నాధ్ ని ట్రోల్ చేస్తున్నారు. పూరి చెప్పిన క్లైమాక్ పెట్టి ఉంటే సినిమా పోయేదని, ఫ్లాప్ అయ్యేదని, అసలు పూరి జగన్నాధ్ అంత సింపుల్ గా ఎలా ఆలోచించాడు అని, ఎన్టీఆర్ కి ఇంకో ఫ్లాప్ ఇద్దామనుకున్నావా అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పూరి జగన్నాధ్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై పూరి మాత్రం స్పందించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News