Maargan Movie: సినీ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారిన విషయాలపై హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 27న ఆయన లేటెస్ట్ మూవీ ‘మార్గన్’ (Maargan) విడుదలవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా రాజకీయ ప్రవేశంపై, అలాగే డ్రగ్స్ సమస్యపై ఆయన ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. విజయ్ ఆంటోని తమిళ ప్రేక్షకులకే కాదు.. తెలుగు వాళ్లకి కూడా సుపరిచితుడే. ఆయన తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేస్తుంటారు. తాజాగా ఆయన రాజకీయ ప్రవేశం (Political Entry)పై ఆయన ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
చాలా మంది స్టార్స్ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్నారు. మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తనకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఫేమ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి రాలేమని ఆయన పేర్కొన్నారు. ‘రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే ఆలోచన కానీ, ఉద్దేశం నాకు లేదు. నటీనటులు ఏదోఒక సమయంలో తప్పకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే రూల్ ఏమీ లేదు కదా’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా రాజకీయాల్లోకి అడుగుపెడితే వారికి పూర్తిస్థాయిలో ప్రజల మద్దతు ఉండాలని, అప్పుడే అధికారంలోకి రాగలరని విజయ్ చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే డ్రగ్స్ ఇష్యూపై కూడా విజయ్ ఆంటోని తన మనసులోని మాట చెప్పారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ సమస్య చాలా కాలంగా ఉందని, డ్రగ్స్ వాడకం కొత్తేమీ కాదని చెప్పారు. మత్తు పదార్థాలకు చాలామంది బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. దీనిపై విజయ్ ఆంటోని మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఉందని, దీనిలో నిజానిజాలు త్వరలోనే బహిర్గతమవుతాయని ఆయన తెలిపారు.
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్గన్’ (Maargan) లియో జాన్పాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాతో విజయ్ మేనల్లుడు అజయ్ ధీషన్ ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. సముద్రఖని, దీప్షిక వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ‘మార్గన్’ జూన్ 27న విడుదల కానుంది. మొత్తంగా, విజయ్ ఆంటోనీ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో రాజకీయ ప్రవేశంపై, సినీ పరిశ్రమలోని డ్రగ్స్ ఇష్యూపై ఎంతో క్లారిటీతో, నిజాయితీగా స్పందించారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని, సేవ చేయగలిగితేనే రాజకీయాల్లోకి రావాలని ఆయన ఇచ్చిన సందేశం నిజంగా ఆలోచింపజేసేది.