Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుPolio drops: పోలియో చుక్కలు వేయగానే ఏకధాటిగా ఏడుపు.. అనంతరం శిశువు మృతి!

Polio drops: పోలియో చుక్కలు వేయగానే ఏకధాటిగా ఏడుపు.. అనంతరం శిశువు మృతి!

Baby died after polio drops: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరాలో విషాదం చోటుచేసుకుంది. పోలియో చుక్కలు వేసిన వెంటనే మూడు నెలల శిశువు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో వారి బంధువులతోపాటు చుట్టుపక్కలవారు సైతం చెమ్మగిల్లి పోయారు. అయితే శిశువు మృతిపై డీఎంహెచ్‌ఓ నాగనిర్మల వివరణ ఇచ్చారు.

- Advertisement -

కంగ్టి మండలం భీంరా గ్రామానికి చెందిన సర్కున్‌దొడ్డి స్వర్ణలత–ఉమేశ్‌ దంపతులకు మూడు నెలల క్రితం పండంటి బాబు జన్మించాడు. పోలియో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన స్పెషల్ డ్రైవ్‌ ఆదివారం ఉండటంతో.. పోలియో చుక్కలు వేయించేందుకు వీరి నలుగురి పిల్లలను పల్స్‌ పోలియో కేంద్రానికి తీసుకొచ్చారు. ముగ్గురు ఆడపిల్లలకు పోలియో చుక్కలు వేసిన అనంతరం.. మూడు నెలల శిశువుకు కూడా డ్రాప్స్‌ వేయించారు. అయితే చుక్కలు వేసినప్పటి నుంచి శిశువు ఏకధాటిగా ఏడుస్తూఉన్నాడు. దీంతో ఏడుపు ఆపేందుకు తల్లి స్వర్ణలత పాలు తాగించే ప్రయత్నం చేసింది. అయితే పాలు తాగుతున్న సమయంలోనే శిశువు చలనం కొల్పోయినట్లుగా తల్లి గమనించింది. వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లగా శిశువు మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో శిశువు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు: తన బిడ్డ మరణానికి పోలియో చుక్కలే కారణమని శిశువు తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు.. శిశువు మృతదేహాన్ని సమీపంలోని ఖేడ్‌ ఆస్పత్రికి తరలించారు. శిశువు మృతదేహాన్ని పరిశీలించిన డీఎంహెచ్‌ఓ నాగనిర్మల.. మృతికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేశారు. శిశువు ఏడుస్తుండగా తల్లి పాలు తాగించడంతో ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్లి మృతి చెందే అవకాశాలున్నాయని అన్నారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/today-pulse-polio-vaccination-campaign/

పోలియో చుక్కలు కారణం కాదు: శిశువు మృతికి పోలియో చుక్కలు కారణం కాదని ఖేడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తాను వైద్యులు, వైద్యాధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్టు తెలిపారు. ఒకే వాయిల్‌లోని చుక్కలను వేయించుకున్న ఇతర చిన్నారులెవరికీ ఏమీ కాలేదని అన్నారు. మృతికి గల కారణాలను వైద్యుల పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. ఏదిఏమైనా శిశువు తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలిందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad