Sunday, September 8, 2024
Homeనేరాలు-ఘోరాలుAcid Attack : స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి.. వైరలవుతున్న దృశ్యాలు

Acid Attack : స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి.. వైరలవుతున్న దృశ్యాలు

దేశ రాజధాని ఢిల్లీలో స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. 17 ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు బాలికపై యాసిడ్ పోశారు. తీవ్రగాయంతో అల్లాడిపోయిన బాలికను వెంటనే సఫ్దర్‌గంజ్ ఆస్పత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ముఖంపై యాసిడ్ ఎక్కువగా పడటంతో కళ్లకు తీవ్రమైన గాయాలైనట్టు యువతి తండ్రి పేర్కొన్నాడు.

- Advertisement -

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఇద్దరు అనుమానితుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. బాలిక స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మోహన్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ దృష్టి సారించింది. ద్వారకా మోడ్ సమీపంలో ఓ పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ పోశారని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బాధితురాలికి అండగా ఉంటామని చెప్పారు. సీసీటీవీలో రికార్డైన యాసిడ్ దాడి దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. ప్రేమ లేదా కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News