Tuesday, June 24, 2025
Homeనేరాలు-ఘోరాలుBurn man alive: అరకులోయలో వ్యక్తిని సజీవ దహనం చేసిన గ్రామస్తులు

Burn man alive: అరకులోయలో వ్యక్తిని సజీవ దహనం చేసిన గ్రామస్తులు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుంబ్రిగూడలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడన్న నెపంతో అడారి డొంబురు అనే వ్యక్తిని గ్రామస్తులు పెట్రోల్ పోసి సజీవ దహనం (Burn man alive) చేసి తగులబెట్టారు. ఈ సంఘటన అరకులోయ నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది.

- Advertisement -

అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుంబ్రి గుడ గ్రామానికి చెందిన అడారి డొంబురు (60) అనే వ్యక్తి గ్రామంలో చిల్లంగి, చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గ్రామస్తులంతా కలిసి డొంబురును ముందుగా కర్ర, రాయితో కొట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. డుంబ్రిగుడ గ్రామంలో సుమారు 15 కుటుంబాలు నివసిస్తున్నాయి . అయితే కొద్దిరోజులుగా డొంబురు కుటుంబం తమకంట ఆర్థికంగా ఎదుగుతుందని, డొంబురు వలనే తాము ఇబ్బందులు పడుతున్నామన్న అక్కుసతో గ్రామస్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు.

సజీవ దహనం సంఘటన తెలుసుకున్న పాడేరు డి.ఎస్.పి షేక్ షహబజ్ అహ్మద్ తమ సిబ్బందితో డుంబ్రిగూడ గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే క్లూస్ టీం ఆ గ్రామానికి చేరుకుని ఆధారాలు సేకరించింది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News