Tuesday, July 2, 2024
Homeనేరాలు-ఘోరాలుChegunta: రైల్వే బోగీలో చిన్నారిని వదిలి వెళ్ళిపోయారు

Chegunta: రైల్వే బోగీలో చిన్నారిని వదిలి వెళ్ళిపోయారు

15 నెలల చిన్నారి, తల్లిపాలు కూడా మరువని చిన్నారిని రైల్వే బోగీలో తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. కాచిగూడ నుండి మెదక్ వెళ్తున్న రైలులో ఏడుస్తున్న చిన్నారిని గుర్తించి, స్థానిక వడియారం రైల్వే స్టేషన్ లోని స్టేషన్ మాస్టర్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే స్టేషన్ మాస్టర్ కామారెడ్డి రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ తావు నాయక్ కు సమాచారం అందించారు. చిన్నారి లభ్యత విషయంపై మెదక్ జిల్లా బాలల సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చి, చిన్నారిని జిల్లా సంరక్షణ కేంద్రానికి తరలించారు చిన్నారికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే జిల్లా సంరక్షణ కేంద్రంలో సంప్రదించాలని వారు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News