Monday, July 8, 2024
Homeనేరాలు-ఘోరాలుChevella: మల్కాపూర్ లో దళితులపై దాడి, కుల వివక్ష

Chevella: మల్కాపూర్ లో దళితులపై దాడి, కుల వివక్ష

బాధితుడు సంజీవకు తీవ్ర గాయాలు

చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామంలో బోనాల పండుగ దళితులపై వివక్ష చూపుతూ…తన అనుచరూలతో గ్రామ సర్పంచ్ దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి మైసమ్మకు అగ్రకులస్థులు బోనాల తీసుతుండగా దళిత వర్గానికి చెందిన గండు సంజీవ అక్కడికి వెళ్లి చూస్తుండగా…నీవు మాదిగోనివి. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ నా కొడుక అని గ్రామ సర్పంచ్ శివారెడ్డి ఆయన బంధువులు అనుచరులు సంజీవపై దాడి చేశారు. సంజీవకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి సంజీవను తరలిచారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భాస్కర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా వైరల్ అయింది. బాధితులు శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రజాసంఘాల నాయకులు హైదరాబాద్ -బీజాపూర్ హైవే పై పిఎస్ ముందు బైటాయించారు. గ్రామ సర్పంచ్ శేరి శివారెడ్డిని అతని అనుచరులను చట్టపరంగ తక్షణమే అరెస్టు చేయాలని నిరసన తెలుపుతూ…ధర్నా నిర్వహించారు.

- Advertisement -

సర్పంచ్ శివారెడ్డి అయన అనుచరులను వెంటనే అరెస్టు చేసి ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఏసీపీ ప్రభాకర్ రంగంలోనికి దిగి నిరసనకారులతో చర్చించి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చి వారిని శాంతింప చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News