అనకాపల్లి జిల్లా గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. బయ్యవరంలో ముక్క ముక్కలుగా మహిళ మృతదేహం (Dead body) పడి ఉండటంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు.
- Advertisement -
కశింకోట మండలం బయ్యవరంలో ఈ దారుణ ఘటన అందర్నీ కలవరపెడుతోంది. గుర్తు తెలియని ఓ మహిళను దుండగులు హతమార్చినట్లు తెలుస్తుంది. ఈ సంచలన సంఘటనలో శరీర భాగాలను నడుము నుండి కింద పార్టు వరకు వేరు చేసి దుపట్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి పరిశీలించిన పోలీసులు.. దుప్పట్లో ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన మహిళ వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని కశింకోట సీఐ స్వామి నాయుడు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు క్లూస్ టీమ్.