చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వికృత చేష్టాలకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు ఈ కీచకుడిపై దాడికి యత్నించారు. ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
- Advertisement -
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై శుక్రవారం ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఉపాద్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఇంటికెళ్లి విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్ కు తీసుకెళ్లారు. విద్యార్థినీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.