Thursday, July 4, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: ఎక్స్ పైరీ వస్తువుల ముఠా గుట్టు రట్టు

Hyd: ఎక్స్ పైరీ వస్తువుల ముఠా గుట్టు రట్టు

బొడుప్పల్ లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు చేస్తున్నారు పోలీసులు. కాలం చెల్లిన వస్తువులను రీ సైకిల్ చేస్తున్న ముఠాను సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లను రీసైకిల్ చేస్తున్న ఈ ముఠా, కాలం చెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లకు కొత్త లేబుల్ వేసి మార్కెట్లకు పంపిస్తోంది. సబ్బులు, షాంపులు, తినుబండారాలకు రీసైక్లింగ్ చేస్తున్న ముఠా, కాలం చెల్లిన బ్రాండెడ్ వస్తువులను తీసుకుని పెద్ద ఎత్తున రీసైక్లింగ్ చేస్తోంది. హైదరాబాద్ శివార్లలోని గోదాముల్లో పోలీసుల సోదాలు చేయగా ఈ సోదాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ఆహార పదార్థాలు బయటపడ్డాయి. హైదరాబాద్ కోఠీలోని హరిహంత్ కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు చేయగా మొత్తం 300 రకాల వస్తువులను రీసైక్లింగ్ చేస్తున్న ముఠా వివరాలు వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News