Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుBasheerabad: కొబ్బరి బొండాలు తెంపడానికి వెళ్లిన వ్యక్తి మృతి

Basheerabad: కొబ్బరి బొండాలు తెంపడానికి వెళ్లిన వ్యక్తి మృతి

చికిత్స తీసుకుంటూ మృతి

బషీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తీవ్ర గాయాలపై అయినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. బషీరాబాద్ ఎస్సై రమేష్ తెలిపిన వివరాలు ప్రకారం.. కాసింపూర్ గ్రామానికి చెందిన దత్తాత్రేయ వయసు 23 ఏళ్లు. కొబ్బరి బోండాల తెంపే పనుల్లో ప్రమాదం జరగగా, ఈ ఘటనలో గాయపడ్డ దత్తాత్రేయను తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుని తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు బషీరాబాద్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News