Friday, October 18, 2024
Homeనేరాలు-ఘోరాలుRajanna Sirisilla: రోడ్డుపై వేడుకలు జరిపితే కేసులు నమోదు

Rajanna Sirisilla: రోడ్డుపై వేడుకలు జరిపితే కేసులు నమోదు

రోడ్లపై న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అస్సలు వద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గ్రామాలలో డిసెంబర్ 31 సందర్బంగా రోడ్డుపై విచ్చలవిడిగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై సుధాకర్ హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. మద్యం తాగి విచ్చలవిడిగా వ్యవహరించకూడదని, ఇతరులతో గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కేసులు పెడతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News