Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుThangallapalli: గొడ్డలితో దాడి, అక్కడికక్కడే వ్యక్తి మృతి

Thangallapalli: గొడ్డలితో దాడి, అక్కడికక్కడే వ్యక్తి మృతి

భూ తగదాలతో..

భూ తగదాలతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాకేష్ అనే వ్యక్తి పొలం వద్ద పనులు చేస్తుండగా వరుసకు అన్న అయిన తిరుపతి గొడ్డలితో తలపై దాడి చేయడంతో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. అనంతరం నిందితుడు ఘటన స్థలం నుండి పరారయ్యాడని, ఇరువురి కుటుంబాల మధ్య చాలాకాలం నుండి భూ తగాదాలు ఉన్నాయని స్థానికులు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News