Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుJammu blast: జమ్మూలో టెర్రర్ అటాక్, టెర్రరిస్టులు టార్గెట్ పౌరులే

Jammu blast: జమ్మూలో టెర్రర్ అటాక్, టెర్రరిస్టులు టార్గెట్ పౌరులే

జమ్మూ పేలుడులో ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఐదుగురు గాయపడ్డారు. రాజౌరి జిల్లాలోని డంగ్రీ గ్రామంలో ఈ పేలుడు సంభవించింది. నిన్న జరిగిన ఉగ్ర దాడి బాధితుల ఇంటివద్దే ఈరోజు కూడా ఈ పేలుడు జరిగింది. ఇక్కడి సమీపంలోనే IED కూడా లభించిందని అధికారులు తెలిపారు. ఘటనా కవరేజీలో ఉన్న మీడియా ప్రతినిధులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. ఇద్దరు టెర్రరిస్టులు ఈ ప్రాంతంలో నక్కి ఉన్నారన్న సమాచారంతో జమ్మూలో కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ జోరుగా సాగుతున్నవేళ ఉన్నట్టుండి ఈ పేలుడు సంభవించింది. నిన్న జరిగిన పేలుడులో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. రాజౌరీ జిల్లాలో పౌరులను దాడి చేసుకున్న వరుసగా సాగుతున్న పేలుడులో ఇది రెండవది. గత రెండు వారాలుగా సాగుతున్నఈ దాడులు జమ్మూ పౌరులను వణికిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News