Wednesday, July 3, 2024
Homeనేరాలు-ఘోరాలుKolcharam: అన్నపై పెట్రోల్ పోసి తగులపెట్టిన తమ్ముడు

Kolcharam: అన్నపై పెట్రోల్ పోసి తగులపెట్టిన తమ్ముడు

ఆస్తి విషయంలో గొడవ

ఆస్తి విషయంలో అన్నదమ్ములకు గొడవ కావడంతో అన్నపై తమ్ముడు పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన శనివారం తెల్లవారుజామున కొల్చారం మండలం అప్పాజీపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన తిమ్మక్కపల్లి శంకరయ్యకు ముగ్గురు కుమారులు ప్రవీణ్, ప్రశాంత్, అశోకులు ఉన్నారు. ప్రశాంత్ ను గ్రామంలోని చింతల రాములు ఇంటికి ఇల్లరికం పంపారు. ఇల్లరికం వెళ్లిన ప్రశాంత్ గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తన అన్న ప్రవీణ్ తమ్ముడు అశోక్ లతో గొడవ పడుతున్నాడు. తనకు ఆస్తిలో వాటా కావాలని తరచు గొడవలు జరుగుతున్నాయి. శంకరయ్య భార్య లక్ష్మి ముగ్గురు కుమారులు ఆస్తిలో వాటా పంచుకోవాలని చెప్పడంతో పాటు వాటా ఇవ్వకపోతే అన్న ప్రవీణ్ ను చంపుమని చెప్పడంతో, తల్లి మాటలు విని ప్రశాంత్ అందరూ నిద్రించిన తర్వాత పెట్రోల్ తీసుకువచ్చి ప్రవీణ్ పై పోసి తగలబెట్టాడు. దీంతో ప్రవీణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు ప్రవీణ్ మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 90% శాతం కాలిన గాయాలతో శాతం గాయాలతో ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News