Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుKothapalli: భక్తులపై తేనెటీగల దాడి, ఒకరి మృతి 50 మందికి గాయాలు

Kothapalli: భక్తులపై తేనెటీగల దాడి, ఒకరి మృతి 50 మందికి గాయాలు

కొత్తపల్లి మండలం అటవీ ప్రాంతంలోని ధంతాల లింగమయ్య దేవతలకు మొక్కుబడి తీర్చుకోవడానికి పగిడాల మండలం పాతకోట గ్రామానికి చెందిన కుటుంబం మొక్కులు తీర్చేందుకు బంధువులతో కలిసి దేవాలయం వద్దకు చేరుకున్నారు. మొక్కుబడి తీర్చుకొనే పనిలో భక్తులందరూ నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటనలో పాతకోట గ్రామానికి చెందిన వెంకట శివారెడ్డి అనే రిటైర్డ్ విఆర్ఓ మృతి చెందగా, మరో 50 మంది తేనెటీగల దాడిలో గాయపడి అపస్మారక స్థితిలో ఉండటంతో హుటాహుటిన వీరిని కొత్తపల్లి మండలంలో ఎర్రమట్టం హాస్పిటల్, ఆత్మకూరు హాస్పటల్ కు అత్యవసర చికిత్స కోసం తరలించారు. వైద్యులు యుద్ద ప్రాతిపదికన భాదితులకు అత్యవసర వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మకూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ పరామర్శించారు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News