Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుKurnool: టూరిస్ట్ బస్సు బోల్తా, కర్ణాటక టూరిస్టులకు గాయాలు

Kurnool: టూరిస్ట్ బస్సు బోల్తా, కర్ణాటక టూరిస్టులకు గాయాలు

రుద్రవరం రేంజి పరిధిలోని నాగంబావి సమీపంలో కర్ణాటక కు చెందిన KA 51 C 14 0 8 నెంబర్ గల టూరిస్ట్ వాహనం అదుపుతప్పి బోల్తా పడిన గతంలో కర్ణాటక చెందిన పలువురు టూరిస్టులకు గాయాలయ్యాయి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు బెంగళూరు నుండి టూరిస్ట్ వాహనంలో పదిమంది వచ్చారు. టూరిస్ట్ వాహనం రుద్రవరం రేంజ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో గల నాగంబావి దాటి కొంత దూరం వెళ్ళగానే వాహనానికి రోడ్డుపై వానరం అడ్డు రావడంతో డ్రైవర్ తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ తోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న పదిమంది కర్ణాటక వాసులకు స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో ప్రమాదం తప్పడంతో కర్ణాటక వాసులు ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు నుండి నరసింహస్వామి దర్శనానికి అహోబిలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రమాదంలో ఎవరికి తీవ్ర గాయాలు కాకపోవడంతో మరో వాహనంలో పదిమంది కర్ణాటక వాసులు స్వామి దర్శనానికి వెళ్లారని వాహనం డ్రైవర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News