Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుMadhya Pradesh: 16 ఏళ్ల పక్కింటబ్బాయి 58 ఏళ్ల ఆమెను రేప్ చేసి..

Madhya Pradesh: 16 ఏళ్ల పక్కింటబ్బాయి 58 ఏళ్ల ఆమెను రేప్ చేసి..

16 ఏళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అఘాయిత్యానికి పాల్పడి, అత్యాచారం చేసి, హత్యచేసిన దుర్ఘటన కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో ఈ ఘోరం జరిగింది. అయితే రెండేళ్ల క్రితం జరిగిన సెల్ ఫోన్ దొంగతనం ఈ బాలుడే చేసినట్టు బాధితురాలి కుటుంబం ఆరోపించిన నేపథ్యంలో అతను కక్ష తీర్చుకోవటంలో ఈ నేరానికి పాల్పడ్డట్టు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కైలాస్ పుర గ్రామంలో జనవరి 30వ తేదీ ఇదంతా జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

అత్యాచారానికి పాల్పడే ముందు మృతురాలి నోట్లో ప్లాస్టిక్ బ్యాగ్, గుడ్డలు కుక్కి, ఆమె అరుపులు బయటికి వినపడకుండా చేసినట్టు పోలీసులు వివరిస్తున్నారు. ఆమె ఇంట్లో భవన నిర్మాణం పనులు జరుగుతుండగా అక్కిడికి లాక్కెళ్లి..బలంగా ఆమె తల, చేతులు, కాళ్లను బాదేసినట్టు పోలీసులు వివరించారు. ఆతరువాత కొడవలితో ఆమెను నరికి చంపాడు. పక్కింట్లోనే ఉండే ఈ అబ్బాయి తరుచూ టీవీ చూసేందుకు తమ ఇంట్లోకి వచ్చేవాడని బాధితురాలి కుటుంబసభ్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News