Sunday, September 22, 2024
Homeనేరాలు-ఘోరాలుMallapur: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి..

Mallapur: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి..

తోటి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో అక్కడే కుప్పకూలి యువకుడు మరణించిన ఘటన గొర్రెపల్లిలో చోటుచేసుకుంది.  మండల కేంద్రంలో నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్ లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ పరుగు కోసం పరిగెత్తి  గొర్రెపల్లి గ్రామ సర్పంచ్ కుమారుడు కొంపెల్లి  రాజ విష్ణు (35) గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన మిత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. విష్ణుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరితో కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ హఠాత్తు మరణం పట్ల మిత్రులు, క్రికెట్ క్రీడాభిమానులు విషాదం వ్యక్తం చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి హఠాత్తుగా అనంత లోకాలకు వెళ్లడం  పట్ల గొర్రెపల్లి గ్రామంలో  విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News