Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుSecundrabad : కళ్లలో కారంకొట్టి.. కత్తితో పొడిచి.. దుండగుడి ఘాతుకం

Secundrabad : కళ్లలో కారంకొట్టి.. కత్తితో పొడిచి.. దుండగుడి ఘాతుకం

సికింద్రాబాద్ లో ఓ దుండగుడు దారుణానికి తెగబడ్డాడు. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసి.. అతడి నుండి 14 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లో సోమవారం రాత్రి సమయంలో జరిగింది. హిమాయత్ నగర్‌లోని రాధే జువెల్లర్స్‌కు చెందిన పవన్ బంగారు నగలతో సికింద్రాబాద్ కు బయలుదేరాడు. సికింద్రాబాద్ చేరుకున్నాక ఓ వ్యక్తి అతనివద్ద బంగారు నగలున్నాయని గ్రహించాడు. వాటిపై కన్నేశాడు.

- Advertisement -

సిటీలైట్ హోటల్ సమీపంలో దుండగుడు అతనిపై దాడి చేశాడు. కళ్లలో కారం చల్లి, కత్తితో పొడిచి.. పవన్ వద్దనున్న 14 తులాల బంగారు నగలను లాక్కొని పరారయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దుండగుడి కోసం గాలిస్తున్నారు. దుండగుడి ముఖాన్ని గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News