చిన్న చిన్న కష్టాలను మనిషి ఎదుర్కొనలేక బలవంతంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. మరి ఈ రైలులో ప్రయాణించే వ్యక్తికి ఏ కష్టం వచ్చిందో తెలీదు. ఏకంగా రైలులోనే బలవంతంగా ఉరివేసుకుని ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రేపల్లె నుంచి సికింద్రాబాద్ వెళ్లే పాస్ట్ ప్యాసింజర్ రైలులో ఆదివారం ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. మృతుడు బాపట్ల జిల్లా చీరాల మండలం చినగంజాంకి చెందిన రాంబాబు (43)గా గుర్తించారు.
- Advertisement -
మృతుడు లారీ క్లీనర్ గా పనిచేసేవాడని తెలిసింది. సమాచారం అందిన వెంటనే నడికుడి జంక్షన్లో రైల్వే పోలీసులు 15 నిమిషాల పాటు రైలును నిలిపివేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.