Sunday, September 8, 2024
Homeనేరాలు-ఘోరాలుManchiryala: భార్య వేధింపులకు తాళలేక ఆర్మీ జవాన్ ఆత్మహత్య

Manchiryala: భార్య వేధింపులకు తాళలేక ఆర్మీ జవాన్ ఆత్మహత్య

వివాహమైన ఏడాదిన్నరకే కట్టుకున్న భార్య ప్రియునితో కలిసి భర్తను అవమానాలకు గురి చేస్తుంటే వేధింపులను తాళలేక మనస్థాపానికి గురైన ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు దారి తీసిన ఘటన మంచిర్యాలలో సంచలనం సృష్టిస్తోంది. మంచిర్యాల ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక హమాలివాడకు చెందిన శ్రవణ్ కుమార్ (32) హాజిపూర్ మండలం ర్యాలిగడుప్పూర్ కు చెందిన బొడ్డు రజితతో 2021 జూన్ 24న వివాహం జరిగింది. శ్రావణ్ కుమార్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగ రీత్య ఇటీవల అమృత్ సర్ ప్రాంతానికి వెళ్లాడు. కొంత కాలంగా ఉద్యోగరీత్యా దూరంగా ఉండడంతో ర్యాలిగడపూర్ కు చెందిన బొప్ప రాకేష్ తో రజితకు వివాహేతర సంబంధం నడిచింది. ఇటీవల ఇంటికి వచ్చిన శ్రావణ్ కు ఈ విషయం తెలియడంతో పలు మార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలను నిర్వహించి రజితను మందలిచ్చారు. అయినా రజితలో మార్పు కనపడక పోవడంతోపాటు రజిత తల్లి భాగ్య, ప్రియుడు రాకేష్ ఇద్దరూ శ్రావణ్ ను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన శ్రావణ్ గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడి మరణానికి కోడలు రజిత, భాగ్య, రాకేష్ లు కారణమని మృతుని తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్థానిక పోలీసులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News