Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుManchiryala: సంఘవిద్రోహ శక్తులకు సహకరించొద్దు

Manchiryala: సంఘవిద్రోహ శక్తులకు సహకరించొద్దు

అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందిగా తనిఖీలు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలింగ్ స్టేషన్స్, ఫెర్రీ పాయింట్లు సందర్శించి, అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో పాల్గొని, చెక్ పోస్ట్ వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల భద్రతా చర్యలలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జిల్లా నీల్వయి పోలీస్ స్టేషన్ పరిధిలోని జజులపేట, సంపుటం, వేమనపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలీస్ సిబ్బందికి తగు జాగ్రతతలు సూచించారు మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కెకన్., ఐపిఎస్. వేమంపల్లి లోని ఫెర్రీ పాయింట్ ను సందర్శించి అక్కడ పడవలు నడిపే వారితో మాట్లాడి అటువైపుగా వెళ్తున్న కొంతమంది ప్రయాణికులను వారి వస్తువులను తనిఖీ చేశారు.

- Advertisement -

కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పంగిడీ సోమరం, అన్నారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా డీసీపీ సుధీర్ రాంనాథ్ కెకన్ మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని సూచించారు. ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, మావోయిస్టుల ప్రలోభాలకు లొంగకుండా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైన కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వారు వస్తే ఆశ్రయం కల్పించవద్దు, మావోయిస్టుల ప్రలోభాలకు ఆకర్షితులు కావద్దన్నారు. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసులు ధ్యేయమన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద ఎదురైనా డయల్ 100 నంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు.

మహారాష్ట్ర నుండి రామగుండం పోలీస్ కమిషనరెట్ పరిధిలోకి మద్యం, డబ్బులు రాకుండా చూడాలి, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ఇతర వస్తువులు, మద్యం రాకుండా తనిఖీలను నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రతి వాహనాన్ని, వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. వాహనాల తనిఖీల సమయంలో వీడియోగ్రఫీ తీసుకోవాలని అన్నారు. ఆయా తనిఖీలలో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వారి వివరాలు నమోదు చేసుకోవాల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసిపి మోహన్, చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, కోటపల్లి ఎస్ఐ సురేష్, నీల్వాయి ఎస్సై సుబ్బారావు, టి.ఎస్.ఎస్.పి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News