Saturday, May 4, 2024
Homeనేరాలు-ఘోరాలుNuguru: పెళ్లైన రెండు వారాలకే బలవన్మరణం

Nuguru: పెళ్లైన రెండు వారాలకే బలవన్మరణం

పురుగు మందు తాగి..

పెళ్లి అయ్యి 16 రోజులు కాకముందే నూతన వధువు పురుగు మందు సేవించి మృతి ఒడిలోకి వెళ్లిన ఘటన వెంకటాపురం మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వెంకటాపురం మండల పరిధిలోని ముత్తారం గ్రామానికి చెందిన బొగ్గుల లక్ష్మయ్య కూతురైన బొగ్గుల శశికళ (25)కు గత 15 రోజుల క్రితం భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి చెందిన సి కొత్తగూడెం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కాగా పెళ్లి జరిపించేటప్పుడు వివాహం సమ్మతమేనని తెలిపిన వధువు పెళ్లయిన తర్వాత నుంచి వరుడితో కనీసం మాటలైన మాట్లాడకుండా ప్రవర్తిస్తోందని పెళ్లి కుమారుడు వాపోయాడు. ఈ క్రమంలో వధువుని తీసుకెళ్లడానికి వరుడు తరఫున తల్లి, కొంతమంది గ్రామ పెద్దలతో వధువు గృహానికి శనివారం చేరుకున్నారు. కాగా ఇంటికి వెళ్దాం అని వరుడు అనేసరికి నువ్వు నాకు ఇష్టం లేదు, నేను రాను అని తెగేసి చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -

ఈ క్రమంలో వరుడు తరపున పెద్దలు అబ్బాయితో వెళ్లకుంటే అబ్బాయి పెళ్లి ఖర్చులు వగైరా ఖర్చులు ఉంటాయి, అవన్నీ మీరు భరించాల్సిందిగా అన్నారని గ్రామస్తులు వాపోయారు. అంతలోనే తీవ్ర మనస్థాపానికి గురైన వధువు పురుగు మందు సేవించి, కొద్ది నిమిషాల్లోనే వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ తరలించే క్రమంలో మరణించినట్లుగా పోలీసులు దృవీకరించారు. మొత్తానికి ఇష్టం లేని పెళ్లి కారణంగానే వధువు బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News