Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుPeapully: ప్రేమ పేరుతో మోసపోయిన బాధితురాలికు న్యాయం చేయాలి

Peapully: ప్రేమ పేరుతో మోసపోయిన బాధితురాలికు న్యాయం చేయాలి

ఏపీ మహిళా సమాఖ్య- CPI

ప్రేమ పేరుతో ఏడు సంవత్సరాల కిందట పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి మరో ఇద్దరికి ఆపరేషన్ చేయించి చివరికి వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ , అధికారం అడ్డుపెట్టుకొని భాదితురాలికి అన్యాయం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకొని, అమ్మాయికి న్యాయం చేయాలని ప్యాపిలి పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో ఏపీ మహిళా సమాఖ్య, సిపిఐ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మహిళా సమైక్య జిల్లా నాయకురాలు షమీమ్ బేగం, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వెంకటేష్ లు మాట్లాడుతూ ప్యాపిలి మండలంలోని ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బాబయ్య, రామాంజనమ్మ కుమారుడు పవన్ అనే యువకుడు జమ్మలమడుగు చెందిన లిల్లీ అనే అమ్మాయిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకొని ఏడు సంవత్సరాలుగా కాపురం చేస్తూ ఇద్దరు ఆడపిల్లకు జన్మనిచ్చి ఈరోజు మరొక పెళ్లికి ఆశపడి అమ్మాయికి ద్రోహం చేస్తూ ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి నాకు అదనపు కట్నం కావాలని అమ్మాయిని బెదిరిస్తూ చిత్రహింసలు పెడుతూ ఇంట్లో నుంచి తరిమి కొట్టారని, ఆ అమ్మాయికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే ..నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నిన్ను చంపేస్తానని ప్రకాష్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ లను ఆశ్రయించారు భాదితురాలు. ఇంత జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా బాధితురాలికి అండగా ఉండి అమ్మాయికి న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు షబానా, మాధవి,సూర్య, పద్మావతి, మరియు చిన్న ఓబులేసు, బాల రంగన్న, మాధన్న,తిమ్మయ్య, మధు, బాలకృష్ణ, శీను, నాగన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News