వైయస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో గురువారం ఘోరం ప్రమాదం(Accident) జరిగింది. చిలమకూరు వద్ద కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదు మందికి గాయాలయ్యాయి.
- Advertisement -

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షత్రగాత్రులను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని, ట్రాక్టరును తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై మిగిలిన వారిని అడిగి తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.