Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుShadnagar: సినిమా పక్కీలో హత్య

Shadnagar: సినిమా పక్కీలో హత్య

ఛేదించిన పోలీసులు

సినిమా స్టైల్ లో మర్డర్ పక్క ప్లాన్ ప్రకారం కాళ్లతో తొక్కి పట్టి వరిచేను నీటి బురదలో తలను ముంచి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసి చివరికి అదే బురదలో పాతిపెట్టిన కేసును పోలీసులు చేదించారు. శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని తేదీ 29/ ఆగస్టు 2023 రోజున కరుణ కుమార్ మిస్సింగ్ అయ్యాడని తన ఆన్న దీపక్ కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన ఇతను కేశంపేట మండల పరిధిలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూన్న క్రమంలో మిస్సింగ్ పిర్యాదు చేశారు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమకు తెలిసిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేయాలని ప్లాన్ ప్రకారం తేదీ 15/ ఆగస్టు 2023 న కేశంపేట మండలంలోని నిడదవెళ్లి గ్రామం నుండి జూలపల్లి వెళ్లే రోడ్డులో వరి చేను పొలం దగ్గరికి పిలిపించుకొని కాళ్లు చేతులు కట్టేసి వరి చేను నీటి బురదలో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి, అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు. అయితే రంజిత్ కుమార్ కూతురు విషయంలో కరుణ కుమార్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తన కూతురు నుదుటిపై సింధూరం లాంటి బొట్టు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తమ పరువు ఎక్కడ పోతుందోనని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులపై 302, 201 ,34 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసే రీమాండ్ కు తరలించారు. ఈ హత్య కేసులో రంజిత్ తో పాటు మంతోష్ కుమార్ దబ్లు కుమార్ అనే వ్యక్తులను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా ఇద్దరు మైనర్లు కావడంతో వారి వివరాలను మీడియాకు చూపించని నేపథ్యంలో జువైనల్ హోమ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో షాద్ నగర్ ఏసిపి రంగస్వామి షాద్ నగర్ రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి కేశంపెట్ మండల ఎస్సై వరప్రసాద్ తదితరులు ఉన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News