Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుSirisilla: తంగళ్ళపల్లిలో దొంగల బీభత్సం

Sirisilla: తంగళ్ళపల్లిలో దొంగల బీభత్సం

గుడిలో, షాపులో దొంగతనం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రాళ్లపేటలో శనివారం పెద్దమ్మ గుడి, రెండు కిరణా షాపులలో చోరీ జరిగింది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం దొంగలు గ్రామంలోని పెద్దమ్మ గుడిలోకి చొరబడి హుండీ, వెండి ఆభరణాలు దొంగలించారన్నారు. షేక్ గోరెమియ, సయ్యద్ గోరిబీ కిరణా షాపులలో సుమారు 5 వేల విలువైన నిత్యావసర సరుకులను కాజేశారని గ్రామస్థులు, బాధితులు తెలిపారు. పెద్దమ్మ గుడిలో అలాగే ఊళ్లో చోరీ చేసిన దొంగలను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు ఎస్సైను కోరారు. ఘటనాస్థలికి ఎస్సై వెంకటేశ్వర్లు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News