Sunday, September 8, 2024
Homeనేరాలు-ఘోరాలుSuryapeta: అమెరికా కాల్పుల్లో నేరేడుచర్ల యువతి మృతి

Suryapeta: అమెరికా కాల్పుల్లో నేరేడుచర్ల యువతి మృతి

అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి ఐశ్వర్య రెడ్డి మృత్యువాత పడ్డారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణం ఓ షాపింగ్ మాల్ లో శనివారం దుండగులు జరిపిన కాల్పుల్లో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణానికి చెందిన మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తాటికొండ రామ నరసింహారెడ్డి, మనమరాలు తాటికొండ ఐశ్వర్య (27)మృతి చెందింది. ఐశ్వర్య తండ్రి తాటికొండ నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు, తల్లి అరుణ గృహిణి. కాల్పుల్లో ఐశ్వర్యతో పాటు మరో 8 మంది మృత్యువాత పడ్డారు. ఐశ్వర్య అమెరికాలో పర్ఫెక్ట్ జనరల్ లో ప్రాజెక్టు మేనేజర్ గా చేస్తున్నారు, ఐశ్వర్య మృతి పట్ల తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు, నేరేడుచర్ల పట్టణంలో సైతం విషాద ఛాయలు నెలకొన్నాయి. మే నెలలో ఐశ్వర్య పుట్టినరోజు ఉండడంతో అనంతరం పెళ్లి నిశ్చయించాలనుకున్నారు. ఈలోపే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News