Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుThalasani: క్యూనెట్ బాధితులను ఆదుకుంటాం

Thalasani: క్యూనెట్ బాధితులను ఆదుకుంటాం

క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని ఆయన నివాసంలో క్యూ నెట్ బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్ లో కొనసాగుతున్న క్యూ నెట్ అనే సంస్థలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆకర్షణీయమైన ఆదాయం లభిస్తుందని మాయమాటలు చెప్పి ఒకొక్కరి నుండి లక్షన్నర నుండి 3 లక్షల రూపాయల వసూలు చేశారన్నారు. డబ్బులు ఇచ్చిన వారిలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బాధితులున్నారని మంత్రికి వివరించారు.

- Advertisement -

అగ్నిప్రమాదంలో మరణించిన ఆరుగురు కూడా తమ లాగే క్యూ నెట్ లో డబ్బులు చెల్లించారని తెలిపారు. తమకు మంచి భవిష్యత్ లభిస్తుందన్న నమ్మకంతో తమ తల్లిదండ్రులు, బంగారం, ఆస్తులు తనఖా పెట్టి డబ్బులు కట్టారని మంత్రికి మొరపెట్టుకున్నారు. స్పందించిన మంత్రి వెంటనే క్యూ నెట్ నిర్వహకులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థకు చెల్లించిన డబ్బులను బాధితులకు ఇప్పించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

క్యూ నెట్ నిర్వాహకులపై వెంటనే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని మహంకాళి పోలీసు అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదంలో ఎంతో భవిష్యత్ ఉన్న 6 గురు మరణించడం చాలా దురదృష్టకరం అని మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల ఒక్కొకరి కుటుంబానికి ముఖ్యమంత్రి ప్రకటించిన 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరయ్యాయని ప్రకటించారు. త్వరలోనే బాధిత కుటుంబాలకు అందజేస్తామని మంత్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News