Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుWife killed husband: యాదాద్రిలో దారుణం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..!

Wife killed husband: యాదాద్రిలో దారుణం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..!

Crimes in yadadri district: యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అతి కిరాతకంగా హత్య చేయించింది. ఆ తర్వాత ఈ దారుణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

- Advertisement -

వివరాల్లోకి వెళ్తే, సోమవారం కాటేపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. ఉదయం సమయంలో బైక్‌పై వెళ్తున్న స్వామిని వెనుక నుండి కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఈ ప్రమాదంపై పోలీసులకు అనుమానం రావడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. స్వామి మరణం ప్రమాదం కాదని, అతని భార్యే హత్యకు పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలు కారును అద్దెకు తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఒక్కసారి ఢీకొట్టినా స్వామి చనిపోకపోవడంతో, మరోసారి అతని మీదుగా కారును నడిపినట్లు విచారణలో తేలింది.

స్వామి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ దారుణం వెనుక ఉన్న కుట్ర బట్టబయలైంది. ఆమెతో పాటు ప్రియుడు, బావమరిది, సుఫారీ కిల్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad