Sunday, October 6, 2024
HomeదైవంAhobilam: నరసింహస్వామికి 70 లక్షలు విలువ చేసే ఆభరణాలు

Ahobilam: నరసింహస్వామికి 70 లక్షలు విలువ చేసే ఆభరణాలు

బెంగళూరు భక్తుడి వితరణ

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామికి ఎమ్మెల్యే గంగుల కుటుంబానికి ఆప్తులు, సన్నిహితులు అయిన బెంగుళూరు చెందిన దిలీప్ కుమార్, రాజ్ కుమార్ , శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికి 70 లక్షల విలువ గల బంగారు పూత (గోల్డ్ ప్లేటెడ్) పూసిన కవచ కుండలాలు, కిరీటాన్ని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి సమక్షంలో స్వామి వారికి సమర్పించారు. బంగారు ఆభరణాలు అందజేసిన దిలీప్ కుమార్ రాజ్ కుమార్ ఆలయం మర్యాదలతో వారిని సత్కరించి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్వామి వారిని దర్శించుకున్న వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారికి 70 లక్షలు విలువచేసే ఆభరణాలను సమర్పించిన దిలీప్ కుమారు, రాజ్ కుమార్ లను ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కె డి సి సి బ్యాంకు డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు, మండల వైస్ ఎంపీపీ నాసారి లక్ష్మీ నరసింహ ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News