Sunday, October 6, 2024
HomeదైవంAhobilam: నరసింహనామ స్మరణతో ఘనంగా రథోత్సవం

Ahobilam: నరసింహనామ స్మరణతో ఘనంగా రథోత్సవం

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. దిగువ అహోబిలంలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 46వ పీఠాధిపతి శ్రీ శ్రీ వన్ శఠగోప రంగరాజ యతేంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ప్రహల్లాద వరుదుడు శ్రీదేవి భూదేవి నుప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు. స్వామివారు శ్రీదేవి భూదేవి ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం రథములో ఆశీనులయ్యారు ,రథోత్సవానికి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి గంగుల భరత్ రెడ్డి, డిఎస్పిఐ సుధాకర్ రెడ్డి గజ్జల రాఘవేంద్ర రెడ్డి మఠం ప్రతినిధి సంపత్, మేనేజర్ శ్రీనివాసన్ రంగరాజులు, చింతకుంట శ్రీనివాస్ రెడ్డి సింగం వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, అధికారులు , భక్తులతో కలసి నరసింహ స్వామి గోవిందా గోవిందా అంటూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో తరలి రావడం ఆలయ ప్రాంగాణంమంతా కిక్కిరిసిపోయింది.
భక్తులతో సందడితో రథం నాలుగు మాడల వీధుల్లో ఘనంగా ఆలయానికి ఎదురుగా ఉన్నా మండపానికి చేరింది. 46 పీఠాధిపతి స్వామి వారు స్వామివారి అమ్మవారి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చి ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News