మహానంది క్షేత్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా సూర్యపూజ, ఆదిత్య యంత్ర ఆరాధన, సూర్యునికి త్రిచ పూజావిధానంలో అర్ఘ్య ప్రదానం చేశారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/1b03fb64-76dc-427f-8053-6bcbf5b5b437-768x1024.jpg)
సూర్య నమస్కారాలు ఆచరించి, రథమునకు ఆవాహన చేసి రథాన్ని కదిలించారు. అనంతరం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రథాన్ని సిద్దం చేస్తున్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/064d8579-f57e-427b-875e-887ca3c61c91-768x1024.jpg)
ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, కూరగాయల దాత లక్కబోయిన ప్రసాద్, మాజీ ధర్మకర్త గంగిశెట్టి మల్లికార్జున, దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/bf403749-5948-48ae-b113-37eee0d9ed2b-1024x576.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/91d6f67a-4b51-4a87-bd58-49a8133e9d40-1024x576.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/f9beeeca-5597-48de-9dd9-ffa5c1146799-1024x840.jpg)