Sunday, November 16, 2025
HomeదైవంRudravaram: పార్వేట ఉత్సవ మూర్తులకు పూజలు

Rudravaram: పార్వేట ఉత్సవ మూర్తులకు పూజలు

అహోబిలం ఉత్సవ విగ్రహాలకు మూడవరోజు ఘనంగా పూజలు

మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో పారువేట పల్లకిలో కొలువుదీరిన ఉత్సవమూర్తులకు మూడవరోజు శుక్రవారం భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పారువేట ఉత్సవాలలో భాగంగా గ్రామంలో పలు కాలనీలో సందర్శించి ఆయా తెలుపులపై పల్లకిలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఉత్సవ మూర్తులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలమూరు గ్రామంలో భక్తులతో పూజలు అందుకున్న ఉత్సవ మూర్తుల పల్లకి శుక్రవారం రాత్రికి తిమ్మనపల్లె గ్రామం చేరుకుంది. గ్రామ సమీపంలోకి పారువేట పల్లకి చేరుకోగానే గ్రామస్తులు ఉత్సవమూర్తుల పల్లకిని గ్రామంలోకి ఘనంగా ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad