Friday, April 11, 2025
HomeదైవంRudravaram: అహోబిలం ఉత్సవమూర్తులకు పూజలు

Rudravaram: అహోబిలం ఉత్సవమూర్తులకు పూజలు

పార్వేటలో భాగంగా..

మండల పరిధిలోని టీ లింగందిన్నె గ్రామంలో భక్తులు ఉత్సవమూర్తులకు ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాలలో భాగంగా పల్లకి మోసే బోయిల గ్రామానికి చేరుకున్న ఉత్సవమూర్తులకు భక్తులు అభిషేకాలతో విశేష పూజలు అందించారు. పార్వేట సందర్శనలో భాగంగా మొదటిరోజు శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరిన పల్లకి గ్రామంలో ఆయా తెలుపులపై కొలువు తీరగా గ్రామ రెవెన్యూ అధికారి పుల్లయ్య, పంచాయతీ కార్యదర్శి హరిబాబు, వీఆర్వో నాగ నరసింహుడు, గ్రామ సేవకులు, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివార్లకు కొబ్బరికాయ పూలమాలలు పూజా సామాగ్రి సమర్పించుకుని స్వామివారిని దర్శించుకోగా, పూజారులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తుల పారువేట పల్లకి రాకతో గ్రామంలో తిరుణాల వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News