Saturday, October 5, 2024
HomeదైవంKajipeta: దక్షిణ కాశీ శ్రీ మెట్టుగుట్టపై రాములోరి కల్యాణం

Kajipeta: దక్షిణ కాశీ శ్రీ మెట్టుగుట్టపై రాములోరి కల్యాణం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా,,

దక్షణ కాశీగా విరాజిల్లుతున్న మెట్టుగుట్టపై శ్రీ సీతా రామచంద్ర స్వామి- శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానాలలో శ్రీ రామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

- Advertisement -

స్వామి వారి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి కె. శేషుభారతి, శివాలయం చైర్మెన్ పైడిపాల రఘుచందర్ ఆధ్వర్యంలో జరుగగా, వర్ధన్నపేట శాసన సభ్యులు K.R నాగరాజు, జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుహాసిని శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లని దర్శించి, కళ్యాణం తిలకించారు.

అర్చకులు పరాశరం విష్ణువర్ధనాచార్యులు, రాగిచేడు అభిలాష్ శర్మ, పారుపల్లి సత్యనారాయణ శర్మ ధర్మకర్తలు బైరి రాజు , వస్కుల ఉమ , దండిగం శ్రీనివాస్ , రొడ్డ దయాకర్ ,బోగి కేదారి, మాడిశెట్టి జ్ఞానేశ్వరి , 46 డివిజన్ కార్పొరేటర్, మునిగాల సరోజన , 64 డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి , ఆలయ సిబ్బంది మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News