మహానంది క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం, పెళ్లి ముహూర్తాలు ఉండడంతో వధూవరుల బంధువులు, అధిక సంఖ్యలో భక్తులు మహానందికి తరలివచ్చారు. కోనేరులలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ మహానందీశ్వర స్వామివారికి అభిషేకం, శ్రీ కామేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మహానంది ఆలయంతో పాటు వినాయకనంది, గరుడనందిలో భక్తులు పూజలు నిర్వహించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/4960c560-0754-43ec-a287-976b6116034a-1024x555.jpg)