మహానంది క్షేత్రంలో పుష్యబహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోషకాలంలో వైభవంగా నందీశ్వర అభిషేకం నిర్వహించారు. ఆలయ వేదపండితులు, అర్చకుల ముందుగా గణపతి పూజ, కలశార్చన, పీఠపూజ, పంచామృతాభిషేకం, వివిధ రకాల చూర్ణాభిషేకము, వస్త్రాఛ్ఛాదన, అంగపూజ, అర్చన మొదలగు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మధు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/fdd8c277-6c40-4339-9f5e-7485c1159314-1024x768.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/b7abd2a8-41bd-4414-bc6e-20bf3f2ae0fe-1-1024x768.jpg)