మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి వారికి సోమవారం సందర్భంగా వైభవంగా పల్లకిసేవ నిర్వహించారు. ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/735cd076-4e24-4fa6-97d7-d6a66233cf08-1024x576.jpg)
పూజల అనంతరం ఆలయ ప్రాకారంలో వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/eded5b9c-fe1c-41bd-9897-4372449d400e-1024x576.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/284e46cc-84ee-448b-ae62-b256dccd5864-1024x576.jpg)